టిడిపి నాయకులు, ఎంపీటీసీ సంధాని
గుండాల అక్టోబర్ 20 (మన్యం మనుగడ) దాడులు చేస్తే భయపడే కార్యకర్తలం కాదని టిడిపి నాయకులు గుండాల ఎంపీటీసీ ఎస్.కె సంధాని అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ. వైసిపి నాయకులు టిడిపి పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తూ కార్యకర్తలను కొట్టినంత మాత్రాన బెదిరే ప్రసక్తే లేదన్నారు. రానున్న రోజుల్లో వైసీపీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షలు తోలేం సాంబయ్య , కార్యదర్శి ఇల్లందుల అప్పారావు, ఇల్లందుల నర్సింహులు పాల్గొన్నారు
Post A Comment: