CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి..... ఎఫ్ ఆర్ సి కమిటీలు ఆమోదించిన వారందరికీ పొడుగు పట్టాలు ఇవ్వాలి... సిపిఎం మండల మహాసభలో మిడియం బాబూరావు

Share it:

 


మన్యం టీవీ చర్ల: చర్ల మండలం లోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో సిపిఎం మండల మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, ఎక్స్ ఎంపీ అయినటువంటి మిడియం బాబూరావు ముఖ్యలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం గ్రామసభల తీర్మానం ప్రకారం పోడు సాగు దారులకు పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర సిపిఎం కార్యవర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం చర్ల మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. దళిత,గిరిజన గ్రామాల అభివృద్ధి సంబంధించిన ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను సక్రమంగా అందించాలని కోరారు. చర్ల కేంద్రంలో విద్యాభివృద్ధి అభివృద్ధి చేసే విధంగా చర్ల మండలంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్స్ ఇల్లు మంజూరు చేయాలని , నిర్మాణం పూర్తయిన ఇళ్లను ప్రజలకు కేటాయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కే.బ్రహ్మచారి, మండల కార్యదర్శి కొండా చరణ్, మండల సభ్యులు కారం నరేష్, బోళ్ళవినోద్,నాగరత్నం, చర్ల మండలం ఉపసర్పంచ్ శివ, సుబ్బంపేట సర్పంచ్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: