మన్యంటీవి, అశ్వారావుపేట: మన్యం వీరుడు అటవీ హక్కుల పోరాట యెదునికి ఘననివాళుళు అర్పించిన అశ్వారావుపేట ఆదివాసీ సంఘం నాయుకులు. తెలంగాణాలో తొలిదశ ఉద్యమ కారుడు, రజాకార్లపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి ఆదివాసీల రక్షణకై నడుం బిగించి, అధివాసీ బిడ్డలు ఊచకోతకు భలైయ్యే తరుణంలో కోమరంభీం అడవిబిడ్డల రక్షణకై ఆదివాసీల కోసం దొరల చేతిలో రజాకార్ల చిత్రహింసలు ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటు కూడా విప్లవం శంఖం పూరించి, అప్పటి క్రూర పాలనను సమర్ధవంతంగా తిప్పికొట్టడమే కాకుండా ఆదివాసీలకు తమ హక్కులను గుర్తుచేస్తూ తిరుగుబాటు జెండా ఎగువేసిన మన్యం వీరుడికి, తన 81 వ వర్ధంతి గుర్తుచేసుకుంటూ, అశ్వారావుపేట గవర్నమెంట్ కాలేజీ ఎదురుగా ఉన్న కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి కోమరంభీం చేసిన విప్లవాలను ఉద్యమాలను గుర్తుచేస్తూ అశ్వారావుపేట ఆదివాసీ సంఘం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మండల అధ్యక్షుడు పాయం దుర్గారావు, వగ్గేల అనసూర్య, ఆదివాసీ జెఏసీ నాయకులు బండారు సూర్యనారాయణ, తాటి పోతురాజు, ఉద్యోగస్తులు కంగాల ఆదినారాయణ, వాడే లక్ష్మీ, కట్రం స్వామి దొర, కుర్సం రమేష్, పద్ధం శ్రీను, సోయం రామూర్తి, బత్తుల సాయి, జేఏసీ పాశం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: