గుండాల అక్టోబర్ 1 (మన్యం మనుగడ) తెలంగాణ జన సమితి ఈ నెల 5న తలపెట్టే సడక్ బంద్ జయప్రదం చేయాలని టి జె ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. పోడు భూముల పట్టాల కై సడక్ బంద్ చేపడుతున్నామన్నారు. ఏడు సంవత్సరాలు గడిచిన రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇవ్వడం లేదన్నారు. సడక్ బంద్ లో అందరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నూనవత్ రవీందర్, గొల్లపల్లి రమేష్ , గడ్డం రాములు, గడ్డం భద్రయ్యలు పాల్గొన్నారు
Post A Comment: