CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రూ 4 లక్షల తో త్రాగు నీటి బోరు ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీపీ గుమ్మడి గాంధీ

Share it:

 


మన్యం టీవి, పినపాక: ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. ఆయన సోమవారం పినపాక మండలం కిష్టాపురం గ్రామం లో మండల పరిషత్ అభివృద్ధి నిధుల నుండి రూ 4 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న త్రాగు నీటి బోరు పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచులకు నీటి కష్టాలు రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ మణుగూరు సబ్ డివిజన్ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, పీఏసీఎస్ అధ్యక్షులు డాక్టర్ రవి శేఖర్ వర్మ ,అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్ , సర్పంచ్ సుతారి సుశీల, అమరవరం సర్పంచ్ మొగుళ్లపల్లి నరసింహారావు, సొసైటీ డైరెక్టర్ నరసింహారావు, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు దాట్ల వాసు బాబు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: