తహశీల్దార్ బాబ్జిప్రసాద్
మన్యం టీవీ మంగపేట.
మండలంలో 4 వ తేదీ నుంచి (సోమవారం) బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించ నున్నట్లు స్థానిక తహశీల్దార్ బాబ్జిప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటన లో తెలిపారు. మండలంలోని 25 గ్రామపంచాయతీ లలో సోమవారం నుండి బతుకమ్మ చీరలు పంపిణీ చేయుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మండలానికి మొత్తం 17708 చీరలు మంజూరు కాగా,వాటిని ఆయా గ్రామాల్లోని రేషన్ షాప్,డీలర్ల ద్వారా పంపిణీ కి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మండల కేంద్రం నుండి అన్ని గ్రామ పంచాయతీలకు చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో పంపిణీ ప్రారంభించిన తదుపరి సోమవారం నుండి మంగపేట మండలం లో చీరలు పంపిణీ చేయబడనున్నట్టు గా తహశీల్దార్ వెళ్లడించారు.చీరల పంపిణీ పర్యవేక్షణ నిమిత్తం గ్రామ స్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి లతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. 18 సంవత్సరములు పై బడి, ఆహరభద్రతా కార్డులో పేరు కలిగియున్న మహిళలందరికీరాష్ట్రప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీచేస్తున్నట్లు ఆయన చెప్పారు. లబ్ధిదారులు పంపిణీ సమయంలో కార్డు, ఆధార్ కార్డు జీరాక్స్,రేషన్ కార్డ్ సమర్పించవలెనని ఆయన సూచించారు. లబ్ధిదారులు మాస్క్ ధరించి, కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని తాహసీల్దార్ ఆ ప్రకటన లో కోరారు.
Post A Comment: