మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని కునవరం గ్రామ పంచాయతీ హరిజన వాడ లో సి.సి రోడ్ కు ఆదివారం కూనవరం సర్పంచ్ ఏనిక.ప్రసాద్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గాంధీజి కలలు కన్న గ్రామ స్వరాజ్యం ను,తీసుకు రావడం కోసం పంచాయతీ లకు నిధులు కేటాయించి,అభివృద్ధి లో పినపాక నియోజకవర్గం ను ముందు భాగంలో నడిపిస్తున్న, ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా. కాంతారావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందులో భాగంగా నే హరిజన వాడలో సి.సి రోడ్ కు శంకుస్థాపన చేసుకున్నామని, దీంతో హరిజన వాడ లో సి.సి రోడ్లు పూర్తిగా,కంప్లీట్ ఐపోయాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏనిక.ప్రసాద్,ఎం.పి.టి.సి ల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు,వార్డ్ మెంబర్లు ఎలిబోయిన.సురేష్, కలగుర.శంకర్,మాజి వార్డ్ మెంబర్ ముసలి.శ్రీనివాస్, రామక్క,చిన్నక్క,మైసమ్మ,నారాయణ,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: