గుండాల ఆళ్లపల్లి అక్టోబర్ 21 (మన్యం మనుగడ) యూరి రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలం పరిధిలోని సంధ్య బంధం పాఠశాల విద్యార్థులకు 23 వేల రూపాయల విలువగల పుస్తకాలు, బ్యాగులు , పెన్నులు , మంచి నీళ్ల బాటిల్స్ ను అందజేశారు. అనంతరం సంస్థ సభ్యులు బి బాలు, రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థ ద్వారా వస్తువులను అందజేస్తున్నామని, రానున్న రోజుల్లో మిగతా పాఠశాలలకు కూడా సేవలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం స్కూల్ చైర్మన్ నాగేశ్వరరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, టి పి టి ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జోగ రాంబాబు, కాంప్లెక్స్ హెచ్ఎం చెన్నకేశవరావు , సి ఆర్ పి సునీత , ఉపాధ్యాయులు బొజ్జ , కిరణ్ , గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: