👉హర్షం వ్యక్తం చేసిన పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు
మన్యం టీవి, పినపాక:
పినపాక శాసనసభ్యులు , ,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పై 2018 ఎలక్షన్ సమయంలో బూర్గంపాడు పోలీసు వారు నమోదు చేసినటువంటి క్రిమినల్ కేసును నాంపల్లిలోని ఎంపీ ,ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి గారు కొట్టివేశారు. గతంలో అదే కోర్టు వారు 2018 ఎలక్షన్ సమయంలో అశ్వాపురం, మణుగూరు ,ఏడూళ్ల బయ్యారం పోలీసులు నమోదు చేసినటువంటి కేసులను కూడా కొట్టివేయడం జరిగింది. రేగా కాంతారావు గారి తరపున న్యాయవాదులుగా గరికె సంపత్ కుమార్ , సామా సునీల్ కుమార్ రెడ్డి వాదించడం జరిగింది.
Post A Comment: