భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 4 (మన్యం టీవీ) :- కొత్తగూడెం మునిసిపల్ పరిధిలోని 16వ వార్డు లో మేధరబస్తీ నందు రాష్ట్ర ప్రభుత్వం చేపటీనటువంటి బతుకమ్మ చీరాల కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ మాచర్ల రాజకుమారి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ బతుకమ్మ - దసరా పండుగలు మహిళలు అందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా వేడుకలను ఘనంగా జరుపుకోవాలని. తెలంగాణ ఆడపడుచులు పండుగగా ప్రఖ్యాతి గాంచిన ఈ పూల పండుగను జరుపుకోవటం మన అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. అదేవిధంగా అమ్మవారి దయతో అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను అని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాచర్ల రాజకుమారి, కో ఆప్షన్ సభ్యులు దుడల బుచ్చయ్య, మాజీ కౌన్సిలర్ మాచర్ల శ్రీనివాస్, బిల్ కలెక్టర్ చంద్రమౌళి, ఆర్ పి సత్య, శోభ, లక్ష్మి, అంగన్వాడీ టీచర్ శ్రీదేవి, రాజ్యలక్ష్మి, ప్రమీల, శివ కుమారి, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
Post A Comment: