CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతిపిత గాంధీజి 152వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్

Share it:

 



మన్యం టీవీ ఏటూరు నాగారం

అహింసా,సత్యాగ్రహం అనే ఆయుధాలతో సూర్యుడు అస్తమించని బ్రిటీష్ వారికి పశ్చిమాన్ని చూపించిన మహాత్ముడు మన జాతిపిత గాంధీజీ 152వ జయంతి సందర్భంగా ములుగు జడ్పీ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీష్ నివాళులు అర్పించారు. మహాత్ముని 151వ జయంతి ఉత్సవాలు ముగిసి 152వ జయంతి నేడు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన చూపిన గాంధీమార్గమే నేటికి అందరికీ అనుసరణీయమని అన్నారు. 

అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తే...ఆయన మార్గంలో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ బాపు కేసిఆర్ అని అన్నారు.భారతా మాత తల రాతను మార్చి,తరతరాల యమ యాతను తీర్చిన విధాత గాంధీజి అయితే తెలంగాణ తల్లి తల రాతను మార్చి...ఆత్మగౌరవ ప్రతీకను ఎగురవేసిన ఉద్యమ నేత సిఎం కేసిఆర్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పిండి రవి,పోరిక హర్జీ నాయక్,కృష్ణా రెడ్డి,మహమ్మద్ తాహెర్ పాషా,ద్రోణచారి,జలగం మోహన్ రావు,పొలం శ్రవణ్, అంతటి రాము గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: