-కరకగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన,ర్యాలీ
మన్యం టీవి,కరకగూడెం:
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో వినాయక చవితి రోజున ఆరేండ్ల చిన్నారి చైత్రపై అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగం రాజును కఠినంగా శిక్షించాలని కోరుతూ కరకగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో చిన్నారి చిత్ర పటానికి పూలమాలతో నివాళ్ళు అర్పించి నల్ల బ్యాడ్జిలు ధరించి,ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసి పెట్రోల్ బాంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మొహమ్మద్ ఫారూఖ్ మాట్లాడుతూ.. చిన్నారుల,మహిళలపై దాడులకు పాల్పడుతున్న కామాంధులకు కఠినంగా శిక్షించి మరలా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు..అంతేకాకుండా చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు సారిక లింగయ, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల సురేష్, ఉపాధ్యక్షుడు గనగాని ప్రవీణ్,ప్రచార కార్యదర్శి జాడి విజయ్ కుమార్, స్టీరింగ్ కమిటీ సభ్యులు మొహమ్మద్ రఫీ,సభ్యులు పోగుల రాము,అత్తె నాగరాజు,విష్ణు,మిట్టపల్లి మొహంత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: