👉 కామ్రేడ్ యాస కొండలరావు ప్రార్ధివా దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు..
👉 ప్రజానేత అంతిమయాత్రలో పాల్గొన్న రాజకీయ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు కడసారి కన్నీటి వీడ్కోలు..
మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 29, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ యాస కొండలరావు మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్, సిపిఎం జాతీయ నాయకులు బి వెంకట్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పోతినేని సుదర్శన్, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోనంనేని సాంబశివరావు, వైరా డివిజన్ నాయకురాలు విజయ బాయి, మండల నాయకులు గుండెపిన్ని వెంకటేశ్వర్లు, డిఎస్పి కృష్ణమూర్తి, ఎంపీపీ సోనీ, జెడ్పీటీసీ కళావతి, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, సండ్రా నరేంద్ర కుమార్, చీమలపాటి బిక్షం, ఆదివాసీ నాయకులు అరెం రామయ్య, పలువురు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. యాస మృతికి సంతాపంగా మండల కేంద్రంలోని వ్యాపారులు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బందు నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రజానేత కామ్రేడ్ యాస కొండలరావు అంతిమయాత్రలో రాజకీయ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు తన చిన్ననాటి మిత్రులు భారీ ఎత్తున పాల్గొని జన హృదయ నేతకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం యాస స్వగ్రామమైన పాపకొల్లు లో అంత్యక్రియలు నిర్వహించారు.
Post A Comment: