మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులుగా అడపా. అప్పారావు,మండల ప్రధాన కార్యదర్శి గా రామిడి. రామిరెడ్డి,పట్టణ ప్రధాన బొలిశెట్టి నవీన్ ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడం పట్ల మణుగూరు మండల ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.బుధవారం జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి మండల నాయకులు తో కలిసి వారిని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,ఎంపీటీసీ బాబురావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,ఉప సర్పంచ్ పి. శంకర్,టిఆర్ఎస్ యువజన అధ్యక్షులు హర్ష నాయుడు, నాయకులు బాబీ జాన్,రామకోటి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: