మన్యంటీవి, అశ్వరావుపేట చైత్ర మరణానికి కారణం అయినా నిందుంతుని కఠినంగా శిక్షించాలని, చైత్ర కుటుంబానికి తగు న్యాయం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశా ఫౌండేషన్ అధ్యుక్షురాలు మరియు అశ్వరావుపేట ఎంపీటీసీ వేముల భారతి అన్నారు. రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ నడిబొడ్డున సింగరేణి కాలనిలో అభం శుభం తెలియని అరుసంవత్సరాల బాలిక చిన్నారి చైత్ర పై అత్యాచార సంఘటన అత్యంత గోరమైనదని, ఇది హృదయ విచారకరమైన పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలమీద స్పందించక పోవడం సిగ్గుమాలిన చర్య అని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ సేక మంత్రి సత్యవతి రాథోడ్ సైతం ఆమె పదవి కాలంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా సోద్యం చూస్తున్నారని మహిళా చట్టాల పై మంత్రిగా పోరాడాల్సిన బాధ్యతను పక్కన పెట్టడం సరికాదని చైత్ర కుటుంబాన్ని ఆమె ఇప్పటికి పరామర్శించక పోవడం సిగ్గుచేటుగా ఉందనే వెంటనే స్పంధిచి నిందితుడికి ఉరిశిక్ష విధించి చైత్ర కుటుంబానికి ఆర్ధికంగా ప్రభుత్వం అండగా ఉండాలని ఆమె డిమేండ్ చేసారు.
Post A Comment: