ఇళ్లలోకి,ఇంటి చుట్టు చేరిన వరద నీరు భయాందోళనలో గ్రామస్తులు
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని ఐలమ్మ నగర్ నందు రాత్రి కురిసిన వర్షానికి గ్రామస్తులు వరద ప్రవాహం లో చిక్కుకున్నారు. ఇటు కట్ట వాగు,అటు నేరెళ్ల చెరువు అలుగు పడడంతో గ్రామం మొత్తం జలదిగ్బంధంలో ఉంది. పట్టణానికి,ఐలమ్మనగర్ కు రాకపోకలకు అంతరాయం కలిగింది.ఇళ్లల్లోకి నీరు చేరి, ఇళ్ల చుట్టూ భారీగా నీరు నిలవడం తో ఐలమ్మ నగర్ వాసులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. అలుగు వాగుపై వెంటనే నూతన బ్రిడ్జి రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నూతన బ్రిడ్జి,రోడ్డు నిర్మించడం వల్ల ఐలమ్మ నగర్ నుండి చేపల మార్కెట్ కు వెళ్ళుటకు సులువుగా వీలుగా ఉంటుందని,ఇలా వరదలు వచ్చినప్పుడు కూడా మరొక దారిగా ఉపయోగపడుతుంది అని, అధికారులు వెంటనే స్పదించి,తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Post A Comment: