మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లో పోషణ అభియాన్ కార్యక్రమం లో భాగంగా పినపాక సెక్టార్ ఐసిడిఎస్ సూపర్వైజర్ సత్యవతి ఆధ్వర్యంలో పోషణ్ మా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా సెక్టార్ పరిధిలోని తల్లులకు, చిన్న పిల్లలకు అంగన్వాడి కేంద్రం లోని తోటలో పెంచిన కూరగాయలతో పౌష్టిక ఆహారాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, పండ్లు ,కూరగాయలు ను ఆహారంగా తీసుకోవడం వలన, గర్భిణీ స్త్రీలకు పోషకాలు బాగా అందుతాయని, చిన్న పిల్లలకు జావ తయారుచేసి తాగించడం వలన తేలికగా అరిగి పూర్తి ఆరోగ్యంతో ఉంటారని తెలియజేశారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో లో ఎంపీటీసీ చింతపంటి సత్యం, పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, సీతారాంపురం సర్పంచ్ నాలి మహేష్ , ఉప్పాక సర్పంచ్ పూనెం సుజాత,టిఆర్ఎస్ నాయకులు వార నరసింహారావు, అంగన్వాడీ కార్యకర్తలు చంద్రకళ, సరిత, నాగమణి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: