మన్యం టీవీ : బయ్యారం
మహబూబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఈరోజు మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనము ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఆకుల అశోక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: