చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇతర నష్టాలను అంచనా వేయాలని ఆయా శాఖల అధికారులకు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం గుర్రంగూడెం గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్తల ఏర్పాటుచేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ.... అన్ని శాఖల అధికారులు వరద నష్టాన్ని అంచనా వేస్తున్నారు అని, నివేదిక రాగానే త్వరలో జిల్లా కలెక్టర్ను కలిసి నివేదిక అందిస్తామని,అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.టిఆర్ఎస్ గ్రామ కమిటీలు 90 శాతం పూర్తయ్యాయని, మిగతా రెండు మూడు రోజుల్లో మిగతా గ్రామ కమిటీలు పూర్తవుతాయి అన్నారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎల్లవేళల కృషి చేస్తున్నామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్నికి మంచి పేరు వస్తుందని అన్నారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు ఉత్తల ఏడుకొండలు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకట్ నారాయణ,జడ్పి కోఆప్షన్ సభ్యులు రసూల్, ఎంపీటీసీ దారా బాబు, టిఆర్ఎస్ మండల నాయకులు మేడ మోహన్ రావు, గాదె ప్రసాద్, వంకాయలపాటి బాబురావు, సూర వెంకటేశ్వర్లు,ఉన్నం నాగరాజు, అనుమల రమేష్, కొమ్మినేని లక్ష్మణ్ రావు, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: