మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట మట రఘు ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం మండల అధ్యక్షులు చిట మట రఘు మాట్లాడుతూ బ్రిటిష్ వారిపై పోరాడిన స్వతంత్ర సమరయోధుడు నిప్పు కణిక మన భగత్ సింగ్ అని అతి చిన్న వయసులోనే భారత దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మహా వీరుడు ఉద్యమ నేత అని అన్నారు.చిన్ననాటి నుండి బ్రిటిష్ వారిపట్ల కోపం ఉద్రేకం తో ఉన్న భగత్ సింగ్ స్వతంత్రం కోసం ఎంతో పోరాడిన వ్యక్తి అని చిన్న వయసులోనే ఉరితాడుకు వేలాడిన గొప్ప యోధుడు అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వావిలాల నరసింహారావు,ఎండి ఖలీల్, ఖాన్,వావిలాల ఎల్లయ్య, సప్పిడి రాము,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్, మండల ఉపాధ్యక్షుడు రియాజ్,టౌన్ అధ్యక్షులు తాళ్లపల్లి నరేందర్,వెంకట నరసయ్య,కొండ గొర్ల శ్రీనివాస్, కుమ్మరి సతీష్,కుమ్మరి మురళి కొండ గొర్ల మోహన్ రావు, తాటిపల్లి లక్ష్మీనారాయణ, దుర్గం లక్ష్మీకాంత్, సత్యనారాయణ,తాటిపల్లి లవకుమార్,దబ్బగట్ల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: