మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, సాంబాయిగూడెం గ్రామ పంచాయతీ లో నిన్న కురిసిన వర్షాలకు కన్నెబొయిన రాములు ఇంటి పై చెట్టు విరిగి పడి ఇళ్ళు కూలడం తో విషయం తెలుసుకున్న జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, తహసీల్దార్ చంద్రశేఖర్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కాయం. తిరుపతమ్మ,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,ఆర్ ఐ రామయ్య,సెక్రటరీ శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, గ్రామ కమిటీ అధ్యక్షులు అన్నంనేని రాజేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: