CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

✳️🦁 ఆదివాసీల సింహ గర్జన 🦁✳️

Share it:

 


🌳🌳🌳అడవికి, ఆదివాసీల కి విడదీయరాని ప్రకృతి అనుబంధం🌳🌳🌳

👉 లక్ష మంది ఆదివాసీలతో భారీ బహిరంగ సభ🏹✊✊✊✊✊🏹

మన్యం డెస్క్:: ఆదివాసీ పోడు భూముల సమస్యల సాధనకై,పోలవరం ముంపు బాధితుల సమస్యలపై డిసెంబరు నెలలో ఆదివాసీ సింహ గర్జన ను భద్రాచలం లో నిర్వహించనున్నట్లు జాతీయ ఆదివాసీ అఖిలపక్ష సంఘాల జేఏసీ జాతీయ కన్వీనర్ చందా లింగయ్య దొర పిలుపునిచ్చారు...ఆదివారం నాడు భద్రాచలంలోని గిరిజన అభుధ్యయ భవన్ నందు జరిగిన ఆదివాసి,స్వచంద నిర్వాహక సంస్థల్లో పలువురు వక్తలు,శక్తి సంస్థ శివరామకృష్ణ, సామాజిక నిపుణులు భరత్ భూషణ్,ఎన్జీవో గాంధీబాబు,పొడుగు శ్రీనాధ్ లు మాట్లాడుతూ అడవి నుండి ఆదివాసీలను గెంటివేసే ప్రయత్నాలు ప్రభుత్వం మానుకోవాలని,ఆదివాసీకి అడవికి ఉన్న బంధం విడదీయరానిదని,హరితహారం పేరిట పోడు భూముల్లో మొక్కలు నాటే విధానాన్ని మానుకోవాలని,పోలవరం ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించాలని. రాష్ట్ర ప్రభుత్వం ను కోరుతూ డిసెంబరున జరుగు సింహ గర్జనను విజయవంతం చేయాలని కోరారు...

ఈ సమావేశంలో తుడుండెబ్బ మాజీ అధ్యక్షుడు వట్టం నారాయణ దొర, ఐకాస కన్వీనర్ వాసం రామకృష్ణ దొర, సీనియర్ నాయకులు కుర్సం సుబ్బారావు, చిచ్చడి శ్రీరామమూర్తి,పూనెమ్ వీరభద్రం, ఏటిఏ అధ్యక్షుడు కల్లూరి జయబాబు, పూనెమ్ కృష్ణ,ఝాన్సీరాణి, కెచ్చెల కల్పన, జేఏసీ-పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు మొడియం శ్రీనివాసరావు,కుడిమేత సమ్మయ్య,కోర్స చినబాబు దొర,గొగ్గల రామకృష్ణ,వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: