మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గురువారం నాడు పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా 118 గ్రామ పంచాయతీ లలో టిఆర్ఎస్ గ్రామ కమిటీ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం,పట్టణం లో పెద్ద ఎత్తున జెండా పండుగను విజయవంతం చేసిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమాలు ప్రారంభించుకున్నామని,గురువారం నాడు నిర్వహించిన జెండా పండుగ మాదిరిగా,పార్టీ నిర్ణయించిన గడువులోగా పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేయాలని టిఆర్ఎస్ శ్రేణులకు సూచించారు.పార్టీ యంత్రాంగం నియోజకవర్గం లోని మొత్తం వార్డ్,మండల, పట్టణ కమిటీల నియమించుకునే ప్రక్రియను కొనసాగించాలని విప్ రేగా కాంతారావు కోరారు.
Post A Comment: