మండలంలో తీవ్ర సంచలనంగా మారిన ఏకగ్రీవ సర్పంచ్ కి నోటీస్....
చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : విధుల పట్ల అలసత్వం, అభివృద్ధిని పట్టించుకోవడంలేదని వార్డు సభ్యుల ఫిర్యాదు మేరకు చండ్రుగొండ గ్రామపంచాయతీ సర్పంచ్ మాలిపెద్ది లక్ష్మీ భవాని కి జిల్లా కలెక్టర్ అనుదీప్ షోకాజ్ నోటీసు జారీ చేశారు.. నోటీసును గ్రామ సెక్రటరీ సర్పంచ్ ఇచ్చేందుకు వెళ్లగా తీసుకునేందుకు నిరాకరించడంతో బుధవారం పంచాయతీ ఆఫీస్ లోని ఆమె గదికి అంటించారు.. వివరాలు ఇలా ఉన్నాయి.. పంచాయతీ ఆఫీస్ కు రెగ్యులర్ గా రాకపోవడం .. పంచాయతీలో భర్త పెత్తనం చెలాయించడం, అత్యవసర నిర్ణయాలు తీసుకునే సమయంలో గైర్హాజరు అవుతున్నారని, సమస్య చెప్పేందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని వార్డు సభ్యుల ఇటీవల ఎంపీడీవో, ఎంపీఓ కి వినతి పత్రం ద్వారా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును జిల్లా డిపిఓ కి అధికారులు పంపారు. డిపిఓ కలెక్టర్ దృష్టి తీసుకుపోవడం తో సర్పంచ్ లక్ష్మి భవాని నీ సంజాయిషి కోరుతూ 2 రోజులు క్రితం నోటీసు జారీ చేశారు. నోటీసు ని తీసుకునేందుకు సర్పంచ్ తిరస్కరించటంతో పంచాయతీ ఆఫీస్ లోనే ఆమె గదికి అంటించి నివేదికను మండల అధికార్లు డి పి ఓ కి పంపారు
Post A Comment: