CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి నిర్లక్ష్యం?

Share it:

 


సుందరయ్య నగర్ ఇళ్ళ లో చేరిన వరద నీరు

అవస్థలు పడుతున్న కాలనీవాసులు

మన్యం టీవి, మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ లోని సుందరయ్య నగర్ లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం మూలంగా వరద నీరు ఇళ్లలో చేరింది. ప్రజలు పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు .సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే ఈ పరిస్థితి దాపురించింది వారు వాపోతున్నారు. బొగ్గు గనుల నుండి మోటార్ల ద్వారా తరలించే నీరు, వర్షపు నీరు ఒక సారి గా తోడై సుందరయ్య నగర్ ప్రాంత వాసులను అతలాకుతలం చేసింది. వరద నీరు ఇళ్లను చుట్టుముట్టడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. సింగరేణి , మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి భవిష్యత్తులో వరదల నుండి రక్షించాలని వారు కోరుతున్నారు.

Share it:

Post A Comment: