గుండాల సెప్టెంబర్ 27 ( మన్యం మనుగడ) మండలంలో గులాబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. మండలంలోని వాగులు వంకలు తుఫాన్ ప్రభావంతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కిన్నెరసాని, మల్లన్న వాగు, ఏడు మెలికల వాగు, దున్నపోతుల వాగులు, ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండల మండల కేంద్రంలోని ఇంటిని నీరు చుట్టుముట్టడంతో పిల్లలతో సైతం కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. తాసిల్దార్ రంగు రమేష్ వాగులను సందర్శించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తుఫాను ప్రభావం మరో రెండు ఉన్నందున ప్రజలు ఎవరు వాగులు వాగులు దాటి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ బి నాగేశ్వరరావు, ఇరిగేషన్ ఏఈ పృథ్వి, జేఈ మహమ్మద్ జాని, అప్పలనాయుడు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు
Navigation
Post A Comment: