మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి::తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆదేశాలతో గ్రామ కమిటీలు ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో అన్నపురెడ్డిపల్లి మండలంలోని పెద్దిరెడ్డిగూడెం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బోయినపల్లి అవినాష్, ప్రధాన కార్యదర్శిగా రోంటే.సత్యనారాయణ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ బలోపేతానికి వారి సేవలు అందించాలనీ పార్టీ శ్రేణులు కోరుతూ, అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు వేముల హరీష్, బోయినపల్లి సుధాకర్ రావు, కొత్తూరు వెంకటేశ్వరరావు తదితర నాయకులు ఉన్నారు.
Post A Comment: