మణుగూరు సింగరేణియులందరి రక్షణార్థం, లోక కళ్యాణార్థం యంసి టైప్, మరియు హాస్పిటల్ కాలనీ నందు కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ విజయ విగ్నేశ్వరుడికి పంచమ రాత్రోత్సవాలు కాలనీ వాసులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని. స్వామి వారి సన్నిధిలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కోవిడ్ నిబంధనలతో నిర్వహించడానికి ఆలయ కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగా ఏరియా జనరల్ మేనేజర్ జక్కం. రమేష్ గారిని కుటుంబ సమేతంగా సహపంక్తి బోజనాలకు రావలసిందిగా ఆలయ కమిటీ వారు ఆహ్వానం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు వూకంటి. ప్రభాకర రావు గారు,కీసర శ్రీనివాస రెడ్డి, టి. రాం దాస్, కరుణాకర్, ప్రసాద్ మెస్ట్రీ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: