"మహబూబాబాద్ జిల్లా"
మండల నూతన కమిటీ ఎన్నిక.
మన్యం టీవీ బయ్యారం: బయ్యారం మండల కేంద్రంలో గురువారం నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి తాటి స్వామి గారి అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల. లక్ష్మయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ రకాల ఆదివాసి సమస్యలు,ఆదివాసి చట్టాలు,హక్కులకై విస్తృత చర్చలు జరిపారు.ఆదివాసి సమస్యలను పరిష్కరించడం కోసం ఆదివాసి యువత ఆదివాసీ ప్రజలు ఏకతాటిపై నిలిచి పోరాడాలని పిలుపునిచ్చారు. తదుపరి ఈ కార్యక్రమంలో బయ్యారం మండలం నూతన కమిటీని ప్రకటించారు.ఈ సమావేశంలో నూతన కమిటీ మండల అధ్యక్షులుగా పూనెం.పాపారావు (పార్ధు),ప్రధాన కార్యదర్శిగా కొరస. నరేష్,ఉపాధ్యక్షులు బోర్ర.కృష్ణ,చింత రామకృష్ణ,సహాయ కార్యదర్శులు వట్టం. నరసింహారావు,ఈసం రామచంద్రు,ప్రచార కార్యదర్శి కుంజా. విక్రమ్,సాంస్కృతిక కార్యదర్శి సనప.ప్రకాష్,ప్రచార కార్యదర్శి ఈసం. సుబ్బయ్య,కార్యవర్గ సభ్యులు కుంజ.రాజేష్,కుంజ సురేష్,ప్రభాకర్, లక్ష్మయ్య, నరసింహారావు, సురేష్,భాస్కర్,రాజు, రాష్ట్ర వర్గ సభ్యులు కోరం.శేషయ్య, ఈసం.వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు కుంజా.రామనాథం ప్రజాప్రతినిధులు వట్టం.లక్ష్మణరావు, పోలేబోయిన వెంకటేశ్వర్లు, కారం.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: