మన్యం టీవి, దమ్మపేట:మండల పరిధిలో ని
మందలపల్లి గ్రామ పంచాయతీలో పాలకవర్గ సమావేశం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేయుటకు గాను 1500 కుటుంబాలకు ఇంటికి రెండు చొప్పున 3000 ప్లాస్టిక్ డస్ట్ బిన్ లను పంపిణీ చేశారు. డి ఎల్ పి ఓ హరి ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ సమావేశంలో ఎంపీడీవో రవి, ఎంపీఓ కృష్ణ, సర్పంచ్ మడివి దుర్గ, ఎంపీటీసీ అజయ్ కుమార్, ఉప సర్పంచ్ గారపాటి సూర్యనారాయణ, సెక్రటరీ వెంకటేశ్వర్లు కో ఆప్షన్ సభ్యుడు షేక్ సుభాని వార్డు సభ్యులు వెంకయ్య తిరుపతయ్య రామకృష్ణమ్మ లక్ష్మి రఫీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: