మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు,డిగ్రీ కళాశాలలో ఉద్యోగాలు నిర్వహించు ప్రధాన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు, మరియు సిబ్బంది (టీచింగ్ అండ్ నాన్ టీచింగ్) వారికి పాఠశాలలు పునఃప్రారంభం అయినందున ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు,సిబ్బందితో సహా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవలసిందిగా జూలూరుపాడు వైద్యాధికారి డాక్టర్ వీరబాబు ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు అనగా శనివారము ఉదయం 08:30 గంటలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ తప్పక పరీక్షలు చేయించుకోవలసిదిగా కోరారు.
Post A Comment: