మన్యం టివి దుమ్ముగూడెం:. టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ జడ్పీటీసీ,ఎంపీటీసీ,సర్పంచులకు ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన విధంగా 30 శాతం గౌరవ వేతనాన్ని పెంచటం పట్ల మండల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. లక్ష్మీనగరం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు.ఈ సందర్భం జెడ్ పి టి సి తెల్లం.సీతమ్మ మాట్లాడుతూ"గత పాలకుల పాలనలో ఎంపీటీసీ,సర్పంచ్ లకు 750 రూపాయలు గా ఉన్న గౌరవ వేతనాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 6500 ల రూపాయలకు పెంచారని,రాష్ట్రంలో పనిచేసే ప్రతి ఒక్కరికి వేతనాలు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో TRS మండల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి కణితి.రాముడు, అధికార ప్రతినిధి Md. జానీపాషా, ఎం పి టి సి మడకం.రామారావు,సర్పంచులు సరియం సీతారాం,జుంజురి లక్ష్మీ,నూపాసుమిత్ర,రామకృష్ణ,జయసింహ,దామెర్ల.శ్రీనివాస్, పిలక.నరేంద్ర రెడ్డి,భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: