పాల్గొన్న ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు
గుండాల ఆళ్ల పల్లి సెప్టెంబర్ 2 (మన్యం టీవీ) గ్రామ గ్రామాన టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని అన్ని పంచాయతీ లోని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు మాట్లాడుతు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అన్నారు. 60 లక్షల సభ్యత లతో అతి పెద్ద పార్టీగా రాష్ట్రంలోని నెంబర్ వన్ గా నిలిచిన ఏకైక పార్టీ టిఆర్ఎస్ అన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం దిశగా మండలంలో అన్ని గ్రామాల్లో కార్యకర్తలను భాగస్వాములను చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని పినపాక నియోజకవర్గ అభివృద్ధి రేగా కాంతారావు తోనే సాధ్యమన్నారు. రానున్న రోజుల్లో సమిష్టిగా పనిచేసి మండలంలో మండలంలో పార్టీని అగ్రగామిగా నిలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంజు భార్గవి, జడ్పిటిసి కొమరం హనుమంతు, కోపరేటివ్ డైరెక్టర్స్ లక్ష్మయ్య, ఆఫీస్ ఆఫీస్, ఎస్కే బాబా, ఆదాం , బుర్ర వెంకన్న, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: