మన్యం టీవీ ఏటూర్ నాగారం మారుమూల ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో విధులు నిర్వహించే ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య హెచ్చరించారు.సోమవారం మండల కేంద్రంలోని ఐ టి డి ఎ కార్యాలయంలోని వివిధ శాఖల పనితీరు నిర్వహణ తీరు కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం సమావేశంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని,గ్రామీణ ప్రాంతాల్లోని ఆదివాసీల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఎ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి వసంతరావు,ఏవో రఘు, మేనేజర్ లాల్,ఇఇ హేమలత, తాసిల్దార్ రవీందర్ వివిధ శాఖల అధికారులు కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: