మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు లో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యపై ఎం ఈ వో ఆఫీసు ముందు ధర్నా నిర్వహించి, అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు.అనంతరం జరిగిన సభలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుల్తానా మాట్లాడుతూ ..మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పై ముఖ్యమంత్రి చిన్న చూపు చూస్తున్నారని, కనీస వేతనం 10 వేలు ఇవ్వాలని, లాక్ డౌన్ లో వేతనాలు ఇవ్వాలని,పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని,గుడ్లు ప్రభుత్వమే ఇవ్వాలని, వంటకార్మికులపై స్ధానిక రాజకీయ వేదింపులు ఆపాలని,అక్రమ తొలగింపులు ఆపాలని,ప్రమాద బీమా, ఈఎస్ఐ,అమలు చేయాలని ఈ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కు వినతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ,పద్మ,నాగేంద్ర,ఐలమ్మ,పద్మ, జయ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: