CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్ రేగా

Share it:

 



 మన్యం మనుగడ, డెస్క్:


 రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ముఖ్యమంత్రి కేసీఆర్కి కృతజ్ఞతలు తెలిపారు. 

 ప్రస్తుతం పదివేల రూపాయలు ఉన్న జడ్పిటిసి, ఎంపీపీ ల గౌరవ వేతనాన్ని మూడు వేల రూపాయల పెంపుతో మొత్తం రూ.13 వేలకు చేరింది. ప్రస్తుతం ఐదు వేల రూపాయలు ఉన్న ఎంపీటీసీ ల, సర్పంచ్ ల వేతనం అదనంగా మరో రూ.1500 పెంచడంతోపాటు మొత్తం రూ.6500 లకు పెరగడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు తెలిపారు.

Share it:

Post A Comment: