భారీ కేడ్లు ఏర్పాటు చేసిన పంచాయతీ అధికారులు
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని
ఎల్చిరెడ్డిపల్లి వెళ్లే ఆర్ అండ్ బి రహదారి కి దగ్గరలో పెద్దవాగు ఉండడం వలన వరదల సమయంలో కోతకు గురి అవుతూ వచ్చింది. కాలక్రమంలో ఆర్ అండ్ బి రహదారిలో సగభాగం పైగా కోతకు గురైంది. ఈ కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎల్చిరెడ్డిపల్లి పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో, సెక్రటరీ ఆదినారాయణ దగ్గరుండి రహదారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనదారులు దారి మళ్లించి పక్కన నుండి వెళ్లే విధంగా అవకాశం కల్పించారు. వాహనదారులు గమనించేందుకుప్రమాద సూచికలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని పంచాయతీ సెక్రటరీ అది నారాయణ తెలిపారు.
Post A Comment: