మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,పెద్దపల్లి గ్రామంలో వలస ఆదివాసీ గ్రామాన్ని మణుగూరు ఏ ఎస్పీ డాక్టర్ శబరిష్ ఐపీఎస్ సందర్శించారు.ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలను, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు గ్రామంలో ని ఆదివాసీలకు ఉచిత వాటర్ ఫిల్టర్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏ ఎస్పీ శబరిష్ మాట్లాడుతూ,ఏజన్సీ లో నివసించే ఆదివాసీలు ఆరోగ్యంగా ఉండాలని, స్వచ్ఛమైన నీరు తాగడం అంటువ్యాధులు రావని, ఆదివాసీలు ఆరోగ్యం గా ఉండాలని అనే ఉదేశ్యం తో ఫిల్టర్ లను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు.స్వచ్ఛమైన నీరు తాగి అందరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన యువత చెడు మార్గాల్లో నడవకుండా ఉన్నతమైన చదువులు చదువుకొని తమ ప్రాంతానికి,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సీఐ భాను ప్రకాష్,సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: