మన్యం టీవీ మంగపేట.
రమణక్కపేట గ్రామంలో స్థానికంగా ఉన్న అనేక సమస్యలను పట్టించుకోని గ్రామ పంచాయతీ కార్యదర్శి వినోద్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని యువత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది *భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య* డివైఎఫ్ఐ గ్రామ కమిటీ నాయకులు ఇందారపు ప్రతాప్ మాట్లాడుతూ వర్షాకాలం సమయంలో గ్రామంలోని డస్ట్ బిన్ లోని తీయడం లేదు రమణక్కపేట గ్రామంలో విషజ్వరాలు డెంగ్యూ జ్వరాలు వచ్చినా పాగింగ్ స్ప్రే గ్రామాలలో కొట్టడం లేదు వివిధ వీధుల్లో ఉన్న గుంతల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వాటిలో ఆయిల్ బాల్స్ వేయడం లేదు వీధి దీపాలు కూడా లేవు చీకటిలో విష పురుగులు తిరుగుతున్నవి బయటకు రావాలంటే భయంగా ఉంది. గ్రామంలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లించడం లేదు చేయడం లేదు.గ్రామంలోని రైతులు వ్యవసాయ కూలీలు వ్యవసాయ భూముల దగ్గరికి వెళ్లే దారి అతి దారుణంగా తయారయింది దాని నిర్మాణం కోసం కొన్ని డబ్బులు కేటాయించినప్పటికీ ఆ పనిని పూర్తి చేయాలని జిల్లా చైర్ పర్సన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ గ్రామ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని దాని వల్ల రైతులు వ్యవసాయ కూలీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఈసందర్బంగా ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని వర్షాకాలం ఉన్నందున వీధులన్నీ పరిశుభ్రంగా ఉండేవిధంగా బ్లీచింగ్ పౌడర్ శానిటేషన్ చేయాలని దోమల మందు పిచికారి చేయాలని లేనియెడల వాటి వల్ల అనేక మంది ప్రజలు రోగాల బారిన పడతారని ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఆయా సమస్యల పైన పని చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని వర్షాకాలం ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయా సమస్యల పైన యువకులు అధికారులను ప్రశ్నిస్తే వారిని బెదిరింపు గురి చేయడం సిగ్గుచేటని సమస్యలు పరిష్కరించక పోగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం సిగ్గు చేటు అని వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేనియెడల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సందీప్ ,రవి ,కేశవ్ , రమేష్, రఘు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: