మన్యం టీవి, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వేదాంతపురం గ్రామంలో ఒంటరి ఆదివాసి మహిళ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ, మెరుగైన చికిత్స కోసం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే వేదాంతపురం గ్రామానికి చెందిన ఆదివాసి మహిళ దాది కాంతమ్మ 47 సంవత్సరాలు, 25 ఏళ్ల క్రితమే భర్త కూతురిని కోల్పోయి ఒంటరిగానే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ వచ్చింది అయితే రెండేళ్ల క్రితం గుండె సంబంధిత వ్యాధి సోకి చికిత్స పొందుతూ ఇంటికే పరిమితం అయ్యింది. ప్రస్తుతం హైదరాబాదులో గుండె ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో దయా హృదయం గల దాతలు ఎవరైనా సహాయం చేయాలని మన్యంటీవి ద్వారా వేడుకున్నారు. హాస్పిటల్లో వైద్యం ఖర్చుల కోసం మీకు తోచిన సహాయం చేసి ఆదుకో గలరని విజ్ఞప్తి చేశారు. చేసే సహాయం ఎప్పటికీ మరిచిపోనని దయచేసి ఆదుకోగలరని 9346749982 నెంబర్ కు గూగుల్ పే ఫోన్ పే చేసి ఆదుకో గలరని కోరారు.
Post A Comment: