👉సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యుడు కొండపల్లి శ్రీధర్* మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి (సెప్టెంబర్-5):: మండలంలోని బుచ్చన్నగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ సమావేశం తాటి సూర్యం అధ్యక్షతన జరిగింది.సిపిఎం పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల కార్యదర్శి జంగిలి వెంకటరత్నం ముందుగా పార్టీ పతాక ఆవిష్కరణ చేసిన అనంతరం జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ ప్రసంగిస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, లాలూచీ ఒప్పందాలు చేసుకొని,ప్రజలపై పెట్రోల్,డీజిల్,గ్యాస్ రేట్లు పెంచటంతో పాటు పోడు భూముల నుంచి పేద రైతులని వెళ్ళగొట్టే విధంగా మూడు రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తెచ్చి,వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తుందని.మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నాడని.రైతుబంధు,దళిత బంధులను రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అందరికీ ఇవ్వాలని. గిరిజన బంధు అమలు చేయాలని,ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 6 న మండల కేంద్రాల్లో జరిగే ధర్నాను, సెప్టెంబర్ 25 న దేశ వ్యాప్తంగా జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి మడివి నాగరాజు,నాయకులు తాటి సూర్యం,తాటి ముత్యాలు,మెచ్చు వెంకన్న తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: