మన్యం మనుగడ, పినపాక:
విద్యార్థి నాయకుడి నుండి సోషల్ మీడియా లో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు,విప్ రేగా కాంతారావు యొక్క సోషల్ మీడియా కార్యక్రమా లలో చురుగ్గా పాల్గొన్ని,నేటి సమాజానికి ఉపయోగపడే విధంగా కృషి చేయడంతో సందీప్ రెడ్డి కృషిని గమనించిన ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు గా యాంపాటీ సందీప్ రెడ్డి ని నియోజకవర్గ యువజన విభాగం సమావేశంలో అధికారికంగా ప్రకటించడం జరిగింది.ఈ సందర్బంగా యాంపాటీ సందీప్ రెడ్డి మాట్లాడుతూ,నాపై నమ్మకంతో సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు గా భాద్యతలు అప్పగించినందుకు ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు,ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టరు తుళ్ళూరి. బ్రహ్మయ్య కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అదే విధంగా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు,పినపాక నియోజకవర్గ స్థాయి లో పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రతి మండలంలో సోషల్ మీడియా కమిటీలను నియమిస్తాని ఆయన తెలిపారు.సందీప్ రెడ్డి నియామకం పట్ల 7 మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: