*మన్యంటీవి, అశ్వారావుపేట:* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా తిరుమలకుంట గ్రామానికి చెందిన పల్లెల తరుణ్ తేజను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పల్లెల తరుణ్ తేజ మాట్లాడుతూ తనపై నమ్మ కంతో నన్ను అశ్వారావుపేట మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా నియమించినందుకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు బండి పుల్లారావు, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తన వంతు విద్యార్థుల సమస్యలు తెలుసుకొని వాటి పరిస్కారానికి కృషి చేస్తానని తరుణ్ తేజ తెలిపారు.
Post A Comment: