మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామ పంచాయితీ, కాలనిలో ఎల్ఎస్ఎం స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో 70 నిరుపేద కుటుంబాలకు 1,76,000/- వ్యయంతో సంస్థ సభ్యుడు జక్కుల రాంబాబు ద్వారా బియ్యం, నిత్యావసర సరుకుల, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ దేవా సహాయం, సంస్థ బాధ్యులు జక్కుల రాంబాబు, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు జూపల్లి రమేష్, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, జెడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, నులకాని శ్రీనివాస్, జక్కుల జగదీష్, స్థానిక ఎంపీటీసీ మారుతి లలిత, ఉప అధ్యక్షుడు నల్లపు లక్ష్మీపతి, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: