మన్యం టీవి టేకులపల్లి : మండలంలో
కాంపాటి పృద్వి PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు
టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల కు సంబంధించిన ప్లే గ్రౌండ్ లో ప్రాథమిక వైద్యశాల నిర్మాణ పనులు తక్షణమే నిలిపివేయాలని PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాంపాటి పృధ్వీ డిమాండ్ చేశారు.ఈరోజు కళాశాల విద్యార్థులతో జరిగిన మీటింగ్ లో వారు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల కు సంబంధించిన భూమిని ఆక్రమించుకొని ప్రాథమిక వైద్యశాల నిర్మాణ పనులు చేపట్టడం సరైంది కాదు.అభివృద్ధి పనులకు ఎవరు వ్యతిరేకం కాదు కానీ కళాశాల ఆవరణలో వైద్యశాల ఏర్పాటు చేయడం వలన విద్యార్థులు గ్రౌండ్ కోల్పోతారు.మరియు భవిష్యత్తులో కళాశాల భవన నిర్మాణాలు ఏర్పాటు చేయడం కష్టమవుతుంది.అదేవిధంగా రోగాల బారిన పడిన వారు తరచూ కళాశాల ఆవరణ పరిధిలోకి రావడం వలన విద్యార్థులు అనారోగ్యానికి గురై గురయ్యే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది.ఈ కారణం చేత నూతనంగా ఈ కళాశాలను ఎంపిక చేసుకునే వారు విస్మరిస్తారు.ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయులు వారంతట వారే వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కావున తక్షణమే ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని ఈ నిర్మాణ పనులు నిలిపి వేసే విధంగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లో విజయ్,వంశీ, వీరన్న,యామిని, యశోద ,సౌమ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: