కలెక్టర్ కు వినతి పత్రం అంద జేసిన జడ్పీ చైర్మన్
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యను ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ సోమవారం కలిసి పలు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు.
నూతన జిల్లా ఏర్పాటు జరిగిన నాటి గత రెండు సం.రాలు కరోనా వలన జరగవలసిన రీతిలో అభివృద్ధి కాలేదు.
కరోనా తగ్గుముఖం పట్టిన నేపద్యంలో జిల్లా అభివృద్ధి ప్రణాలికను సిద్ధం చేసి అబివృద్ది కోసం నిధులు మంజూరు చేయాలి అని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కోరారు.జిల్లా పరిషత్తు కార్యక్రమంలోస్వీపర్లు,అటెండర్లు కనీస వేతనం లేకుండా ఇబ్బందులు పడుతున్నారు.
వేతనాలకు సంబంధించిన కేసు కోర్టులో ఉంది.తీర్పు ఆలస్యం కావడంతో సరైన వేతనం లేక అవస్థలు పడుతున్న వారికి కనీస వేతనం అందించే ఈ విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
Post A Comment: