మన్యం మనుగడ, పినపాక:
గులాబ్ తుఫాన్ కారణంగా పినపాక మండలం లోని బోటి గూడెం పంచాయతీకి చెందిన మారాయిగూడెం గ్రామం వెళ్లే రహదారి వరద కారణంగా కోతకు గురైందన్న విషయం తెలుసుకున్న పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు అనంతరం ఏడూళ్ల బయ్యారం పెద్దవాగు వరదల కారణంగా కోతకు గురవుతున్న చర్చ్ ప్రాంతాన్ని పరిశీలించారు. వరదలు ఎక్కువ మొత్తంలో కొనసాగితే చర్చి ఉన్న భవనానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ సమస్యను వెంటనే నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కు తెలియజేసి, సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తానని, తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, ఏడూళ్ల బయ్యారం సర్పంచ్ కోరం రజని, పిఎసిఎస్ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు వార నరసింహారావు, సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: