CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గులాబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎంపీపీ గుమ్మడి గాంధీ

Share it:

 


మన్యం మనుగడ, పినపాక: 


గులాబ్ తుఫాన్ కారణంగా పినపాక మండలం లోని బోటి గూడెం పంచాయతీకి చెందిన మారాయిగూడెం గ్రామం వెళ్లే రహదారి వరద కారణంగా కోతకు గురైందన్న విషయం తెలుసుకున్న పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు అనంతరం ఏడూళ్ల బయ్యారం పెద్దవాగు వరదల కారణంగా కోతకు గురవుతున్న చర్చ్ ప్రాంతాన్ని పరిశీలించారు. వరదలు ఎక్కువ మొత్తంలో కొనసాగితే చర్చి ఉన్న భవనానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ సమస్యను వెంటనే నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కు తెలియజేసి, సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తానని, తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, ఏడూళ్ల బయ్యారం సర్పంచ్ కోరం రజని, పిఎసిఎస్ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు వార నరసింహారావు, సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: