CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

✍️ హైకోర్టు న్యాయవాది లక్కినేని గోపీనాథ్ జ్ఞాపకార్థం ఫ్రెండ్లీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్

Share it:


భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 11 (మన్యం టీవీ) లక్కినేని గోపీనాథ్ జ్ఞాపకార్థం వారి స్నేహితులు శనివారం నాడు రుద్రంపూర్ ఆర్ సి ఓ క్లబ్ లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం బార్ అధ్యక్షులు లక్కీనేని సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రపంచంలో కరోనా అనే విపత్తు తో, ప్రపంచంలో ఎందరో మరణించారని , ఈ క్రమంలోనే చెట్టంత కొడుకు లక్కినేని గోపినాథ్ ని కోల్పోయానని, రోజు శిరసు వంచి మోకాళ్లమీద ప్రార్థన చేస్తూ ఆ దేవుడిని నాకు వచ్చిన కష్టం ఇంకా ఎవరికీ రావద్దని ప్రార్థన చేస్తున్నా అని దుఃఖిస్తూ చెప్పారు. 

లక్కీనేని గోపీనాథ్, స్నేహితులు స్నేహానికి మరో నిర్వచనం అని చెప్పారు, గోపీనాథ్ మన నుండి భౌతికంగా దూరం అయినప్పటికీ , గోపీనాథ్ కి ఇష్టమైనటువంటి క్రీడా సంస్కృతిని వారు స్నేహితులు కొనసాగింపు చేయడం, అలాంటి స్నేహితులు ఉన్నందుకు తన స్నేహితులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఆరోగ్యవంతమైన సమాజం కోసం క్రీడలను వ్యాయామాన్ని రోజుల్లో కొంత సమయం కేటాయించి తద్వారా ఇమ్యూనిటీని పెంచుకుని కరోనా మహమ్మారి నుండి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫణి కుమార్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీనివాస్, టూ టౌన్ సిఐ సత్యనారాయణ, రిజర్వుడు సిఐ దామోదర్, హరి బాబాయ్, ఇల్లుటురి రాజు, సోతుకు శ్రీనివాస్, హసన్, సయ్యద్ యాకూబ్, సుధాకర్, కానిస్టేబుల్ రమేష్ మరి కొంతమంది స్నేహితులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: