చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ప్రజా ప్రతినిధులు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు వారి గౌరవ వేతనం 30 శాతం పెంచి నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పదివేల రూపాయలు ఉన్న జడ్పిటిసి, ఎంపీపీ ల గౌరవ వేతనాన్ని మూడు వేల రూపాయల పెంపుతో మొత్తం రూ.13 వేలకు రూపాయలకు చేరింది. ప్రస్తుతం ఐదు వేల రూపాయలు నా ఎంపీటీసీల, సర్పంచుల వేతనం అదనంగా మరో 1500 పెంచడంతోపాటు మొత్తం రూ 6500 పెరగడం జరిగిందని,
మండల అధ్యక్షులు దార వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఉప్పు తల ఏడుకొండలు హర్షం వ్యక్తం చేశారు. ఈ స్పూర్తితో స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ ప్రజా అభివృద్ధికి, ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతను నూటికి నూరు శాతం ప్రజా సంక్షేమం పై చూపాలని టిఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాము...
Post A Comment: