తాను పార్టీ మారుతున్నట్లు వచ్చే వార్తలో నిజం లేదని తెరాస నేత తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తెలిపారు. రాజకీయాల్లో నీతి, నిబద్ధతకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. సీఎం కేసీఆర్తోనే తన ప్రయాణం అని తుమ్మల వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. ఖమ్మం జిల్లాకు కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారని తుమ్మల స్పష్టం చేశారు.
Post A Comment: